బాలింతలు గర్భవతులకు పౌష్టిక ఆహారం పారదర్శకంగా అందించాలి ఎంపీడీవో వెంకటేశ్వర్లు
గుడ్లూరు అక్టోబర్ 22 న్యూస్ మేట్ : మండలంలో అంగన్వాడి కేంద్రాల ద్వారా గర్భవతులు బాలింత మహిళలకు పౌష్టికాహారం సక్రమంగా అందించాలని ఎంపీడీవో ఎం వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని చేమిడిదపాడు కొత్తపేట గ్రామాల్లోని అంగన్వాడి కేంద్రాలను ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా అంగన్వాడీ కేంద్రాల్లో సక్రమంగా డ్యూటీలు చేస్తున్నారా లేదా మరియు కేంద్రాల్లో పౌష్టికాహారం పంపిణీ గురించి ఆరా తీసి అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి చిన్నారుల రిజిస్టర్ వివరాలను కూడా ఈ సందర్భంగా ఆయన తనిఖీ చేశారు.